Breaking News

మహబూబ్‌నగర్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

మే 11, (నేటి తెలుగు పత్రిక): మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పాలకొండ జంక్షన్ వద్ద యూ-టర్న్ తీసుకుంటున్న కారును అతివేగంగా వచ్చిన స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం విషాదాన్ని మరింత పెంచింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

టీఆర్ఎస్ జెండా పండుగకు కవిత పిలుపు.. గ్రామ స్థాయి వరకు పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని ఆదేశం

ఆలయాల కూల్చివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు టార్గెట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *