మే 11, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ యువనేత ఉదయనిధి స్టాలిన్ను డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ అధికారిక ప్రకటన చేసింది. ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు.అదే సమావేశంలో కేఎన్ నెహ్రూను ఉపనేతగా, ఈవీ వేళును పార్టీ విప్గా నియమించారు. రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న పరిణామాల నేపథ్యంలో డీఎంకే తన శాసనసభా వ్యూహాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యువతలో మంచి గుర్తింపు ఉన్న ఉదయనిధికి కీలక బాధ్యతలు అప్పగించడం పార్టీ భవిష్యత్ నాయకత్వానికి సంకేతంగా మారింది.
