Breaking News

‘దృశ్యం 3’ ట్రైలర్‌తో పెరిగిన ఆసక్తి

మే 12, (నేటి తెలుగు పత్రిక): మోహన్‌లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో కనిపించిన టెన్షన్‌భరిత సన్నివేశాలు, డార్క్ విజువల్స్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ ఆసక్తి పెంచుతున్నాయి.ఈసారి ‘దృశ్యం 3’ను వెంకటేష్‌తో రీమేక్ చేయకుండా, మలయాళ ఒరిజినల్ వెర్షన్‌ను తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో అభిమానుల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ, ఈసారి జార్జ్‌కుట్టిని వెంటాడుతున్న శత్రువు ఎవరో అతనికే తెలియదని, అదే కథలో ప్రధాన ఆసక్తిగా నిలుస్తుందని తెలిపారు. తెలియని భయం, మానసిక ఒత్తిడి ఈ చిత్రానికి కీలక అంశాలుగా ఉండనున్నాయని చెప్పారు.మోహన్‌లాల్ పోషించిన జార్జ్‌కుట్టి పాత్ర ఇప్పటికే ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కుటుంబాన్ని కాపాడుకునేందుకు అతను చేసే పోరాటం మరోసారి ఉత్కంఠ రేపనుంది.మే 21న మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. గత రెండు భాగాల విజయంతో ‘దృశ్యం 3’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *