కౌశిక్ రెడ్డికి ఊరట: బంజారాహిల్స్ కేసులో విచారణ వాయిదా
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి (MLA Koushik Reddy) కాస్త ఊరట లభించింది. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించడంపై దాఖలైన కేసులో విచారణ జనవరి 6కి వాయిదా పడింది.
ఈ కేసుకు సంబంధించి, పోలీసులు కౌశిక్ రెడ్డికి ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే, తన తండ్రి హార్ట్ సర్జరీ కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఆయన పోలీసులకు తెలిపారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు, విచారణను జనవరి 6 వరకు వాయిదా వేశారు.
అదే సమయంలో, ఈ కేసులో కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్తో సహా మరో 20 మంది అనుచరులను పోలీసులు నిందితులుగా చేర్చారు.
