శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత
జనవరి 14న మకరజ్యోతి దర్శనం
శబరిమల:
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండల పూజలు ముగియడంతో, భక్తులకు దర్శనాలు అందించడం ఆపివేశారు. ఈ నెల 30న ఆలయం తిరిగి తెరుచుకుంటుంది.
ఇప్పటివరకు 32.50 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమల కొండపై జనవరి 14న జరిగే మకరజ్యోతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఇంకా, జనవరి 20న పడిపూజతో ఈ యాత్ర ముగియనుంది.