విజయవాడ. జూన్ 1 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడలో పశ్చిమ 42 డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రియదర్శిని కాలనీ, 300&450 SFT కాలనీ, లలితా నగర్ ఏరియా లలో తెలుగు దేశం పార్టీ యూనిట్ ఇన్చార్జి భూతి ఇంచార్జి లు కమిటీ మెంబర్లతో కలిసి ఎన్టీఆర్ పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య మాట్లాడుతూ వచ్చే నెలలో కొత్త పెన్షన్లను మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తుందని ఇంకా ఎవరైనా పెన్షన్లు పెట్టుకు నే వాళ్లు ఉంటే పెట్టుకో మని ప్రజలకు తెలియ చేసారు.ఈ కార్యక్రమంలో 300&450 sft కాలనీ ప్రెసిడెంట్ సీత చంద్ర శేఖ ర్, తెలుగు మహిళా లక్ష్మి, మైనార్టీ సెల్ అధ్యక్షులు నజీబ్, కాళిదాసు, బూత్ ఇంచార్జి అలీ, మువ్వా విజయ శ్రీ, ప్రసాద్, మల్లేశ్వరి, షాబుద్ధిన్, అనుదీప్, తదితరులు పాల్గొన్నారు.

