జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ప్రైవేటు, కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగదు రూపంలో జీతాలు చెల్లించడాన్ని నిషేధిస్తూ, అన్ని రంగాల్లో ఉద్యోగుల వేతనాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కొత్త నిబంధనల ప్రకారం కనీస వేతనాలను కాలానుగుణంగా సవరించడంతో పాటు, సెలవు రోజుల్లో పనిచేసే కార్మికులకు రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కాంట్రాక్టర్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో జాప్యం లేదా ఇబ్బందులు తలెత్తితే, సంబంధిత ప్రధాన సంస్థే బాధ్యత వహించి జీతాలు చెల్లించాలని స్పష్టం చేసింది.కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతనాల పారదర్శక చెల్లింపుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
