Breaking News

40 ఏళ్ల కల సాకారం.. నేడు ప్రారంభం దక్షిణ కోస్తా రైల్వే జోన్

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ నేటి నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఉత్తరాంధ్ర ప్రజలు దాదాపు 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ కల నేడు సాకారం కావడంతో ప్రాంతంలో ఆనందం వ్యక్తమవుతోంది.

రాష్ట్ర విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు అంశం పొందుపరిచినప్పటికీ, అమలులోకి రావడానికి 12 ఏళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ డెక్ భవనంలో తాత్కాలిక జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

అదే సమయంలో ముడసర్లోవ ప్రాంతంలో రూ.170 కోట్ల వ్యయంతో 53 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత జోనల్ కార్యాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ జోన్ ఏర్పాటు వల్ల రైల్వే పరిపాలన మరింత సమర్థవంతంగా మారడంతో పాటు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *