Breaking News

Good news for Telangana on Tirumala recommendation letters

తిరుమల సిఫార్సు లేఖలపై తెలంగాణకు గుడ్ న్యూస్

తిరుమల సిఫార్సు లేఖలపై తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను అనుమతించడంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ విషయంపై తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై కీలక చర్చలు జరిపారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

సీఎం చంద్రబాబు సిఫార్సు లేఖలను వారానికి నాలుగు వరకు అనుమతించేందుకు అంగీకారం తెలిపారు. ఇందులో రెండు బ్రేక్ దర్శనాలు మరియు రెండు రూ.300 దర్శనాలు కోసం లేఖలు అనుమతించే విధంగా నిర్ణయం తీసుకున్నారని బీఆర్ నాయుడు వెల్లడించారు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల తరపున తిరుమల భక్తులకు ఈ నిర్ణయం ఉపయుక్తంగా ఉండనుందని, భక్తులు తమ దర్శనాలు సులభంగా చేసుకునే అవకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు. తితిదే భక్తుల సేవకు అంకితమై పనిచేస్తోందని బీఆర్ నాయుడు వివరించారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *