Breaking News

revanth with satyanadella

సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సత్య నాదెళ్ల నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి కూడా హాజరయ్యారు.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంపై, ఫ్యూచర్ సిటీ మరియు ఏఐ సిటీ ప్రతిపాదనలపై విస్తృత చర్చలు జరిగాయి. ముఖ్యంగా, ఏఐ సిటీలో ఆర్‌అండ్‌డీ కేంద్రం ఏర్పాటు కోసం మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషించాలని కోరారు. అలాగే, ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్ అందించడానికి నాదెళ్లను అభ్యర్థించారు.

“ఎన్నికలకే రాజకీయాలు.. తర్వాత కలిసి పని” – సీఎం రేవంత్ సందేశం

రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న నాలుగు డేటా సెంటర్లు మరియు హైదరాబాద్‌ను మరింతగా టెక్నాలజీ కేంద్రంగా విస్తరించే అంశాలపై చర్చలు జరిగాయి. మైక్రోసాఫ్ట్ తెలంగాణలో డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధికి సహకరించేందుకు ఉత్సాహంగా ఉందని, ఈ సమావేశం రాష్ట్రాభివృద్ధికి మరిన్ని అవకాశాలు తెస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *