కొత్త సంవత్సరం వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
కొత్త సంవత్సరాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నాయి. కొత్త సంవత్సర స్వాగతానికి నగరంలో ఎన్నో ఈవెంట్లు నిర్వహించబడ్డాయి. ఈ క్రమంలో, మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు మెట్రో అధికారులు.
సాధారణంగా ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు మెట్రో రైలు సేవలు నిలిచిపోతుంటాయి. కానీ, న్యూఇయర్ వేళ, ఈ సమయాన్ని పొడిగిస్తూ, మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట 15 నిమిషాల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి.
అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు చివరి మెట్రో రైలు ప్రారంభమై, ఒంటి గంట 15 నిమిషానికి చివరి స్టేషన్ చేరుకుంటుంది.
అయితే, మద్యం సేవించి ప్రయాణించే ప్రయాణికులు మరికొంత ఇబ్బంది కలిగిస్తే, మెట్రో అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
