Breaking News

Telangana Cabinet meeting: Preparations for discussion on key issues

తెలంగాణ మంత్రివర్గ సమావేశం: ప్రధాన అంశాలపై చర్చకు సన్నాహాలు

తెలంగాణ మంత్రివర్గ సమావేశం: ప్రధాన అంశాలపై చర్చకు సన్నాహాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

రైతు భరోసా మరియు కొత్త రేషన్ కార్డులు

  • సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని ఇప్పటికే సీఎం ప్రకటించిన నేపథ్యంలో, ఈ పథకంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
  • కొత్త రేషన్ కార్డులు జారీకి సంబంధించి ఆదాయ పరిమితి మరియు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలపై చర్చించనున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ

  • ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది.

కమిషన్ నివేదికలు

  • విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై మంత్రివర్గం లోతైన చర్చ జరపనుంది.

యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి

  • యాదగిరిగుట్ట ఆలయం కోసం తితిదే తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది.
  • ఆలయ పాలన కోసం 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

టూరిజం పాలసీ

  • కొత్త టూరిజం పాలసీపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇటీవల అసెంబ్లీలో కూడా ఈ పాలసీపై చర్చ జరిగింది.

ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రంలోని పలు వర్గాలకు కీలకంగా నిలిచే అవకాశముంది.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *