Breaking News

Government Whip Adi Srinivas flagged against Eleti Maheshwar Reddy

ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజం

ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజం

హైదరాబాద్: బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) చెబుతున్న చౌకబారు విమర్శలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు (Blackmail Politics) మానుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Aadi Srinivas) హెచ్చరించారు.

మీడియా హడావుడి మాత్రమే

“రెండు నెలలకోసారి మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చిన ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి, అక్రమాల పేరిట పట్టుగాలిలా ఆరోపణలు చేస్తూ, ఏ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రజలందరూ గ్రహిస్తున్నారు” అని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఆధారాలతో ముందుకురండి

“మీ వద్ద రాష్ట్రంలో మంత్రుల అవినీతి, అక్రమాలపై ఏమైనా ఆధారాలు ఉంటే, వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించండి. ఆయన తప్పకుండా విచారణ జరిపిస్తారు. లేదంటే కోర్టులను ఆశ్రయించండి. అర్థం పర్థం లేని ఆరోపణలు ప్రజలను మభ్యపెట్టవు” అని ఆది శ్రీనివాస్ చెప్పారు.

కేంద్రం సహకరించడంలేదు

“ఏడు లక్షల కోట్ల అప్పుతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సింది పోయి, విమర్శలు చేయడం సరికాదు” అని మండిపడ్డారు.

రైతులపై ఏమి చేశారో చెప్పాలి

“పదేళ్ల బీజేపీ పాలనలో రైతుల కోసం ఏమి చేశారు? ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామన్న మాటను ఎందుకు నెరవేర్చలేకపోయారు? దీనిపై సమాధానం చెప్పాలి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజులుగా మార్చేలా ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలపై అమలుకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

కేటీఆర్, బీఆర్ఎస్ పాలనపై ప్రశ్నించని మహేశ్వర్

“ఫార్ములా ఈ రేసు కేసుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయినా బీఆర్ఎస్ నేతలపై మీకు ఒక్క మాట కూడా మాట్లాడాలని అనిపించలేదు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై మీరు ప్రశ్నించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?” అని ఆది శ్రీనివాస్ నిలదీశారు.

ప్రజల మద్దతు ఉన్నది కాంగ్రెస్‌కే

“రైతు సంక్షేమానికి, ఆర్థిక ప్రగతికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ప్రతిపక్షంగా మీరు విమర్శలు చేయడం కన్నా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయండి” అని ఆది శ్రీనివాస్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *