Breaking News

Minister Satya Prasad's anger at the revenue conference

రెవెన్యూ సదస్సులో మంత్రి ఆగ్రహం

రెవెన్యూ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం

హైదరాబాద్: రెవెన్యూ సదస్సులో మాజీ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyanprasad) రెవెన్యూ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రాంతీయ రెవెన్యూ సదస్సు ప్రారంభమైన సందర్భంగా, మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ, అర్జీల పరిష్కారంలో ప్రజలు సంతృప్తి లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పరిష్కరించిన అర్జీలలో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఇది బాధాకరమైన విషయమని చెప్పారు.

2016లో అసెంబ్లీలో ప్రస్తావించిన 22ఏ భూముల సమస్య ఇప్పటివరకు పరిష్కరించలేదని మండిపడ్డారు. రెవెన్యూ అధికారుల తీరును కఠినంగా విమర్శించారు. ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటి నుంచి ఈ సమస్యలు త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

సిసోడియా (Revenue Special Chief Secretary) కూడా రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి, ఈ శాఖకు సర్జరీ అవసరం అంటూ వ్యాఖ్యానించారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రేడ్ మిల్ పైన పరిగెత్తినట్లుగా పని చేస్తున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో అర్జీదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, సమస్యలను కచ్చితంగా పరిష్కరించాలని మంత్రి సత్యప్రసాద్ ఆదేశించారు.

ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులు పై ప్రశ్నల వర్షం కురిపించారు. 22ఏ భూములు మరియు ఇళ్ల స్థలాలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ప్రజలు ఎన్ని రోజుల వరకు ఎదురు చూస్తారని నిలదీశారు.

కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం

రెవెన్యూ సమస్యలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోగలిగితే, అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *