Breaking News

Savitri Bai Phule Jayanti organized in Telangana Bhavan

తెలంగాణ భవన్‌లో సావిత్రి బాయి ఫూలే జయంతి నిర్వహణ

|| Savitri Bai Phule Jayanti organized in Telangana Bhavan ||

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో సావిత్రి బాయి ఫూలే (Savitribai Phule) జయంతి కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఆమె సేవలను స్మరించుకునే కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఎం.ఎల్.సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తుల ఉమ, దేవీప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సావిత్రి బాయి ఫూలే మహిళా విద్యా కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వారిగా గుర్తించారు. ఆమె ఎన్నో ప్రతికూల పరిస్థితులలో కూడా మహిళలకు విద్య అందించేందుకు కృషి చేశారు. సావిత్రి బాయి స్వయంగా సొంత వనరులతో విద్యాలయాలను స్థాపించి, భారత దేశం లో మొదటి మహిళా టీచర్‌గా వెలిగారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఎంఎల్‌సీ మధుసూదనాచారి మాట్లాడుతూ, “ఫూలే దంపతుల స్ఫూర్తితో కేసీఆర్ గారు వందలాది గురుకులాలను స్థాపించారు. వారు సమాజంలో ప్రతికూలతలను ఎదుర్కొని బడుగు, బలహీన వర్గాలకు విద్య నందించారు. వారి సేవలు దేశం వేర్వేరు రంగాల్లో అభివృద్ధికి ఎంతో అవసరమని, వారిని భారతరత్నతో గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.”

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “సావిత్రి బాయి ఫూలే దంపతులు రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం, మహిళలకు విద్యావకాశాల కోసం విశేషంగా కృషి చేశారు. బీసీ గణన దేశవ్యాప్తంగా చేపట్టాలి, అలాగే రాష్ట్రంలో బీసీలకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు.”

తుల ఉమ మాట్లాడుతూ, “సావిత్రి బాయి స్ఫూర్తి ద్వారా మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆమె 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడిన యోధురాలు. కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందిగా అన్నారు.”

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *