“హామీలను నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం” : అచ్చెన్నాయుడు
విజయవాడ: కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) తెలిపారు. “తాము అధికారంలోకి వచ్చినప్పుడు, రాష్ట్రం వెంటిలేటర్ పై ఉందని, కానీ కేంద్రం సహకరించడంతో రాష్ట్రానికి ఆక్సిజన్ అందించామని” అన్నారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా రాష్ట్రం సంపద సరిపోవడం లేదు అని అంగీకరించారు. మత్స్యకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. “గత ఐదేళ్లలో, జగన్ మోహన్ రెడ్డి పాలనతో రాష్ట్రం భ్రష్టు పట్టింది” అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
