Breaking News

Ram Ram for Rythu Bandhu if Congress comes to power.. KCR has already said

రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?

“రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?” : కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రైతు భరోసా గురించి మాట్లాడుతూ, “రైతులు అడుక్కోవాలా?” అని ప్రశ్నించారు. తాజాగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రైతు భరోసా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

డిక్లరేషన్ ఇచ్చే బాధ్యత రైతులకు కాదు, ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పారు. “రైతు యాచించాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా కింద ఇవ్వలేదు,” అని పేర్కొన్నారు.

రైతు భరోసా పథకాన్ని నిలిపివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. “ప్రభుత్వం 26,500 కోట్లు వదిలేసింది. బీఆర్ఎస్ హయాంలో 12 సార్లు రైతుబంధు ఇచ్చాం, కానీ మీరు అధికారంలోకి వచ్చాక, కేవలం ఒక్కసారి మాత్రమే రైతుబంధు నిధులు విడుదలయ్యాయి. అది కూడా మేము అధికారంలో లేకపోయిన తరువాత,” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

రైతు భరోసా పథకాన్ని పక్కదారి పట్టినట్లు కాంగ్రెస్ వారు దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *