కేరళలో అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదం: కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందన
కేరళ కొట్టాయం జిల్లాలో అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదం కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించారు.
ప్రమాదంలో గాయపడిన భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు కొట్టాయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. అనంతరం శబరిమల దర్శనానికి అనుమతించిన బండి సంజయ్, భక్తుల తిరుగు ప్రయాణం సాఫీగా జరగేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి, హైదరాబాదుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
బస్సు ప్రమాదంలో గాయపడ్డ భక్తులు వీడియో విడుదల చేస్తూ మాట్లాడుతూ, “మాకు చేసిన సహాయం కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం,” అని చెప్పారు.
ప్రమాదం హైదరాబాదుకు చెందిన అయ్యప్పస్వాముల బస్సు శబరిమల దర్శనానికి వెళ్తుండగా జరిగింది. కొట్టాయం ఘాట్ వద్ద బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన అధికారులు, భక్తుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
