Breaking News

Last five years of destructive rule: Criticism of Chandrababu

గత ఐదేళ్ల విధ్వంస పాలన: చంద్రబాబు విమర్శలు

గత ఐదేళ్ల విధ్వంస పాలన: చంద్రబాబు విమర్శలు

కుప్పం: కుప్పం పర్యటనలో పాల్గొన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాష్ట్రంలోని గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసక పాలన జరిగిందని, విశ్వవిద్యాలయాలను కూడా రాజకీయాలకు బలి చేశారని ఆరోపించారు.

కుప్పం అభివృద్ధి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

కుప్పం అభివృద్ధి (Kuppam Development)పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PPP) ఇచ్చిన చంద్రబాబు, “నేను ఎక్కడ ఉన్నా మీ మనిషినే. కుప్పం ఎమ్మెల్యేను మాత్రమే కాకుండా రాష్ట్రానికి నాయకుడిని కూడా,” అని అన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మంచి పబ్లిక్ పాలసీలు అవసరమని, గత ప్రభుత్వ హయాంలో ప్రజలను అభివృద్ధి కాకుండా అణచివేశారని విమర్శించారు.

ఉపాధి హామీ లబ్ధిదారులకు అలర్ట్.. 48 గంటల్లోనే జాబ్ కార్డు జారీ.

స్వర్ణాంధ్ర విజన్ 2047

1995లోనే విజన్-2020ను ప్రవేశపెట్టినట్లు గుర్తుచేసిన చంద్రబాబు, ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 (Swarnandhra Vision 2047)తో ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు. “దూరదృష్టితో ప్రణాళికలు రూపొందిస్తేనే విజయాలు సాధించవచ్చు,” అని ఆయన సూచించారు.

కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ప్రస్థావన

కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీ స్థాపన ఎన్టీఆర్ దూరదృష్టికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. ఆ యూనివర్సిటీకి అనువైన స్థలం కుప్పమే అని తానే సిఫారసు చేసినట్లు చెప్పారు.

మోడల్ నియోజకవర్గంగా కుప్పం అభివృద్ధి

చంద్రబాబు మాట్లాడుతూ, “కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా, టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. పీపీపీ విధానంతో (Public-Private Partnership) కుప్పం రూపురేఖలు మార్చడమే మా లక్ష్యం,” అని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వ పనితీరుపై బిల్ గేట్స్ ప్రశంసలు.. “గ్రేట్ వర్క్” అంటూ కితాబు

గత ప్రభుత్వంపై విమర్శలు

గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని, విశ్వవిద్యాలయాలను రాజకీయ అడ్డాగా మార్చారని చంద్రబాబు ఆరోపించారు. కుప్పాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తన ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *