కరీంనగర్ జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన సంభవించింది. జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న శర్మానగర్ లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
సోమవారం అర్ధరాత్రి విద్యార్థులు వాంతులు చేయడం గమనించిన పాఠశాల సిబ్బంది, వెంటనే వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
