Breaking News

New Board for APSRTC

సంక్రాంతి పండగకు 7,200 అదనపు బస్సులు

సంక్రాంతి పండగకు 7,200 అదనపు బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ ప్రకటింపు

సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికులకు పెద్దగా ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ 7,200 అదనపు బస్సులను నడపాలని నిర్ణయించింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బస్సులు నడిపే యోచనలో ఉంది.

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

ఈ నెల 8 నుంచి 13 వరకు 3,900 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఇందులో, హైదరాబాద్ నుంచి 2,153, బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేస్తే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.

కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *