Breaking News

A kavitha for KTR's residence.. Harish Rao's former ministers

కేటీఆర్‌ నివాసానికి కవిత.. హరీశ్‌రావు మాజీ మంత్రులు

ఫార్ములా-ఈ కారు రేసు కేసు: ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరికాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసు నేపథ్యంలో కేటీఆర్‌ నివాసం నందీనగర్‌లో రాజకీయ నేతల రద్దీ నెలకొంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఎమ్మెల్యేలు, మంత్రుల రాక
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్యే కవితతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. వీరిలో వేముల ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, బాల్క సుమన్, గాదరి కిశోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేశ్ రెడ్డి, క్రిశాంక్ వంటి పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

లీగల్ టీమ్‌తో కేటీఆర్ చర్చలు
తన లీగల్ టీమ్‌తో కేటీఆర్ సమావేశమై, ఏసీబీ విచారణను ఎలా ఎదుర్కోవాలో సమాలోచనలు చేస్తున్నారు. మాజీ ఏఏజీ రామచంద్రారావు కూడా కేటీఆర్‌తో కలిసి విచారణకు హాజరవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ శ్రేణులు కేటీఆర్‌కి మద్దతు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో నందీనగర్‌కు చేరుకున్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఏసీబీ విచారణపై ఆసక్తి
ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ ఎలా కొనసాగుతుందనే విషయంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కేటీఆర్‌ అనుకూల వైఖరి తీసుకుంటారని, తనపైన ఉన్న ఆరోపణల్ని చట్టపరంగా ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *