Breaking News

CPI leader alleges that Modi, Chandrababu and Pawan Adani conspired

మోడీ, చంద్రబాబు, పవన్ అదానీతో కుమ్మక్కు అయ్యారని సీపీఐ నేత ఆరోపణలు

మోడీ, చంద్రబాబు, పవన్ అదానీతో కుమ్మక్కు అయ్యారని సీపీఐ నేత బాబురావు ఆరోపణలు

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా సీపీఐ నేత బాబురావు తీవ్ర విమర్శలు గుప్పించారు. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన నిరసనల సందర్భంగా బాబురావు మీడియాతో మాట్లాడారు.

“కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది”
ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఛార్జీల భారం తగ్గిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం (NDA) దారుణంగా మోసం చేసిందని, పాత ప్రభుత్వాన్ని విమర్శించిన వారికి ఇప్పుడు అదే విధానాన్ని వేగంగా అమలు చేస్తున్నారని బాబురావు ఆరోపించారు.

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

“సర్దుబాటు చార్జీలతో ప్రజలపై భారం”
గత ఆరు నెలల్లో సర్దుబాటు చార్జీల పేరుతో రూ. 15,500 కోట్ల భారం ప్రజలపై మోపారని, ఇది వారి పైన దాడి చేస్తున్నట్లే అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వ్యవస్థను మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి అదానీకి అప్పగించారని బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“సోలార్ ఒప్పందం రద్దు చేయాలి”
లక్షా 10 వేల కోట్ల సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని గత ప్రభుత్వం అవినీతి ఒప్పందం అని పేర్కొనగా, ప్రస్తుతం ప్రభుత్వం అదే ఒప్పందాన్ని కొనసాగించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయకుంటే ప్రజలు సహించబోరని హెచ్చరించారు.

“స్మార్ట్ మీటర్ల పై విభేదం”
గతంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు అదానీ ప్రయోజనాల కోసం స్మార్ట్ మీటర్లను అమలు చేస్తున్నదని విమర్శించారు. ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని, అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు.

కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం

“వామపక్షాల పోరాటం కొనసాగుతుంది”
ప్రజల హక్కుల కోసం వామపక్షాలు నిరంతరం పోరాడుతాయని, స్మార్ట్ మీటర్లు, సర్దుబాటు చార్జీల విధానాలను రద్దు చేయించే వరకు తమ పోరాటం ఆగదని బాబురావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *