కేటీఆర్పై విరుచుకుపడిన బీర్ల ఐలయ్య
తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కేటీఆర్పై తీవ్రంగా విమర్శలు చేశారు. “ప్రపంచ దేశాల్లో తెలంగాణ పరువు తీసి, సిగ్గులేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని” ఆయన మండిపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అనుమతులు లేకుండా విదేశీ సంస్థలకు రూ. 55 కోట్లు చెల్లించినట్లు ఆయన ఆరోపించారు.
కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే “తస్మాత్ జాగ్రత్త” అని హెచ్చరించారు. “ఆధికారం పోయిందనేది అక్కసుతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నోరు జారుతున్నారని” విమర్శించారు. కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అని ఆయన పేర్కొన్నారు.
“కేటీఆర్ తన తప్పులను సరిదిద్దుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నారని” బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణ ప్రజలు “మిమ్మల్ని ఛీ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా, జైలుకు వెళ్ళినా, కానీ మీరు ముఖ్యమంత్రి పై నోరు జారితే జాగ్రత్త” అని ఆయన హెచ్చరించారు.
“మతి భ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని” బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు.
