సినిమా టికెట్ల ధర పెంపు: రసమయి బాలకృష్ణ, దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం
సినిమా టికెట్ల ధరలు పెంచడానికి, అదనపు షోలకు అనుమతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతినిచ్చిన విషయంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, “అసెంబ్లీలో అర్భాటపు మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు టికెట్ల ధర పెంపుకు అనుమతించడం ఎందుకు?” అని ప్రశ్నించారు.
రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి నిజాయితీగా నిలబడతానని చెప్పిన ఆయన ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని” నిలదీశారు. దిల్ రాజు సినిమాకు టికెట్ల ధరలు పెంచడం, అదనపు షోలకు అనుమతినిచ్చేందుకు వెనుక ఎంత పెద్ద గేమ్ ఉంది, దీనిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు.
రసమయి బాలకృష్ణ అన్నారు, “దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపు కోసం ఎలా పని చేశాడో, తెలంగాణ ప్రజల మౌలిక హక్కుల మీద అతను ఎలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడో ప్రజలకు తెలియాలి.” ఆయన దిల్ రాజు పై విమర్శలు చేస్తూ, “తెలంగాణ ప్రజలకు సినిమా కార్యక్రమాల పేరుతో మాంసం ముక్కలు, కల్లు మాత్రమే ఇచ్చేలా మాట్లాడటం దురదృష్టకరమని” ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమెల్సీ దేశపతి శ్రీనివాస్ కూడా దిల్ రాజు సినీ పరిశ్రమలో తన పాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణలో సినిమాలు విడుదల చేసేందుకు దిల్ రాజు ఇబ్బందులు పెడితే, మాంసం, కల్లు వ్యాపారాలు పెట్టుకునే వారిని ఇక్కడ ఉంచుకో,” అని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్ల పెంపు పై ప్రజలకు సమాధానం చెప్పాలని రసమయి బాలకృష్ణ, దేశపతి శ్రీనివాస్ అభ్యర్థించారు.
