Breaking News

Inauguration of Mini Gokulas

మినీ గోకులాల ప్రారంభోత్సవం

పిఠాపురంలో మినీ గోకులాల ప్రారంభోత్సవం

పిఠాపురం, జనవరి 9: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురం మండలం కుమారపురం లోని కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులం ను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను ఈ కార్యక్రమంలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు బార్ అసోసియేషన్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ చిన్ని

సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్
పిఠాపురం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పవన్ కల్యాణ్ హాజరై ప్రసంగించారు.
శనివారం పవన్ కల్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని, అక్కడ గ్రీన్కి రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్ధన అభివృద్ధికి దోహదపడతాయని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *