Breaking News

Prime Minister Narendra Modi A budget that instills new confidence in India's development

దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా ప్రారంభం

న్యూఢిల్లీ: భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2025) ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా వేడుకల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం, రాజధాని ఢిల్లీలో పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పరేడ్‌లో దేశ సాంస్కృతిక వైవిధ్యం, సైనిక పరాక్రమం ఆవిష్కృతమవుతున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలపై క్లారిటీ.. పెంపు లేదని కేంద్రం స్పష్టం

ఈ సంవత్సరం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. పరేడ్‌కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించారు. సాంస్కృతిక వైవిధ్యం, సైనిక శక్తి, ఐక్యత, సమానత్వం, అభివృద్ధి వంటి అంశాలను ప్రదర్శించేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఈ ప్రత్యేక సందర్భంగా, దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సోషల్ మీడియా వేదికగా ఆయన, “గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గణతంత్ర 75 అద్భుతమైన సంవత్సరాలను జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగ రూపుదిద్దిన మహనీయులైన మహిళలు, పురుషులకు హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను,” అని తెలిపారు.

“ఈ ప్రత్యేక రోజున, మన ప్రజాస్వామ్య పునాదులను గుర్తుచేసుకోవడమే కాకుండా, మరింత బలమైన, సమృద్ధిగా ఉండే భారతదేశ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి” అని ప్రధాని ఆకాంక్షించారు.

రూ.84తో అసెంబ్లీ పోరు.. కేరళ యువతి సెన్సేషన్

ఘనంగా సాగిన పరేడ్ వేడుకలు
ఢిల్లీ రాజ్‌పథ్‌లో జరిగిన ఈ పరేడ్‌లో సైనిక శక్తి, సాంస్కృతిక వైభవం ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. వివిధ రాష్ట్రాల తత్కాలిక రథాలు, సైనిక కవాతు, సాహస ప్రదర్శనలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశమంతటా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *