భువనగిరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటం లేకుండా జాతీయ జెండాను ఎగరేసిన ఘటన, నిరసనలు
యాదాద్రి భువనగిరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటం లేకుండా జాతీయ జెండాను ఎగురవేసిన ఘటన వివాదాస్పదమైంది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగరేసే సమయంలో అంబేద్కర్ చిత్రపటం లేకపోవడంపై బీఆర్ఎస్, బీజేపీ, దళిత సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. వారు క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పోలీసులు రంగప్రవేశం చేయడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
