విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: వైసీపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజీనామాపై పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలోని వైసీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. “విజయసాయి రెడ్డి వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నారని స్వయంగా చెప్పిన విషయం నేను తెలియజేస్తున్నాను” అని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
అనంతరం ఆయన, “నాయకులను ఏ విధంగా తయారు చేయాలో జగన్కు బాగా తెలుసు. ఆయన ఒక టార్చ్బేరర్” అని వ్యాఖ్యానించారు. రాజకీయ ఒత్తిడికి నాయకులు తట్టుకోవడం కొంతమందికి కష్టమేనని, కొందరు ఒత్తిడిని తట్టుకోలేక పోతారని చెప్పారు.
రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదని, రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. వైసీపీనే రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుతుంది” అని చెప్పారు.
అంతేకాకుండా, చంద్రబాబు (Chandrababu) దావోస్ పర్యటనలో పెట్టుబడులు రాకపోయినా మాట మార్చారని దుయ్యబట్టారు.
