Breaking News

Rude comments on Indira Gandhi will not be tolerated

ఇందిరాగాంధీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు సహించేది లేదు

ఇందిరాగాంధీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు సహించేది కాదు: పొన్నం ప్రభాకర్

మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై బీజేపీ నేత బండి సంజయ్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు సహించనీయబడవని హెచ్చరించిన ఆయన, “ఇందిరమ్మ పేరుతో ప్రభుత్వం పథకాలు చేపడితే, వాటికి డబ్బులు ఇస్తారా లేక అందుకు ప్రతిఘటిస్తారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఇంటి నుంచీ డబ్బులు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు.

“ఇందిరమ్మ పేరును వాడిన పథకాలకు బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది?” అని ప్రశ్నించారు. ఇందిరా గాంధీపై దారుణమైన వ్యాఖ్యలు చేయడం దేశాన్ని అవమానించడం మాత్రమే అని పేర్కొన్నారు.

పొన్నం ప్రభాకర్, “తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులేంటో?” అని ప్రశ్నిస్తూ, “జీఎస్టీ ద్వారా కేంద్రం రూ.37 వేల కోట్లు వసూలు చేసిందని, తెలంగాణకు కేంద్రం ఎంత ఇచ్చిందో చూపించాలని” అన్నారు.

దుండగుల దురాగతం.. రైతు శ్రమకు నిప్పులు

అలాగే, “దీన దయాల్ గృహ జ్యోతి, అంత్యోదయ వంటి పథకాలకు కేంద్రం ఎందుకు పౌరాణిక పేర్లను ఇచ్చిందని” ప్రశ్నిస్తూ, వారు దేశానికి ఏం చేసినారు? అని ధ్వజమెత్తారు.

“ఇందిరమ్మ పేరుతో పథకాలు అమలు చేస్తే బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది?” అని కంటికి రెప్పలా ఇందిరాగాంధీని కాపాడాలని ఎత్తిచూపారు.

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు ఒక్క రూపాయి అదనంగా తెచ్చారా? అని కూడా ప్రశ్నించారు.

తన రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నప్పుడు, బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఇబ్బందిపడతారని మండిపడ్డారు. “కేటీఆర్ అన్నీ ప్యాకెట్ల మాదిరిగా పంపిస్తారని ఎద్దేవా చేశారు,” అని పేర్కొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో మూసి పునర్జీవనం: భట్టి విక్రమార్క మల్లు

ప్రభాకర్ , “ప్రతి పథకానికి వచ్చిన లబ్ధిదారుల హక్కులను కల్పించడంలో తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అన్యాయం జరిగితే ప్రశ్నించవచ్చని” స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *