Breaking News

CM Revanth inaugurated Eco Friendly Experience Park

ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

శంకర్పల్లి: ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా, పొద్దుటూరు:
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సినీ లెజెండ్ చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఆకర్షణగా అరుదైన వృక్షాలు, మొక్కలు:
ఈ పార్కులో 85 దేశాల నుంచి దిగుమతి చేసిన అరుదైన 25,000 వృక్షాల జాతులు ఉన్నాయి. వీటిలో కొన్ని వృక్షాల ధర రూ.లక్ష నుంచి రూ.3.5 కోట్ల వరకు ఉంటుంది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే పలు వృక్షాలను కొనుగోలు చేసి ఈ విశిష్టతను మరింత పెంచారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

పర్యాటకులకు ప్రత్యేక అనుభవం:
ఈ పార్క్‌లో పర్యాటకులను ఆకర్షించేలా అనేక రాక్ గార్డెన్లు, ప్రత్యేక ఆకృతుల్లో విభిన్న తీర్పులతో రూపొందించారు. అదనంగా, 1500 మందికి ఆతిథ్యం ఇచ్చే యాంఫీ థియేటర్ ఏర్పాటు చేయబడింది. రూ.150 కోట్ల విలువైన మొక్కలు, వృక్షాలతో ఈ పార్క్ ప్రపంచ స్థాయిలో ఏకైక పర్యాటక ప్రదేశంగా నిలిచింది.

రాందేవ్వ్ ఆరేళ్ల కృషి:
ఈ ఎక్స్‌పీరియం పార్క్ రూపకల్పన కోసం ఆరేళ్లపాటు రాందేవ్వ్ తన అహర్నిశ కృషిని పట్టుదలగా కొనసాగించారు. ఈ మహత్తర ప్రాజెక్టు ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది.

సీఎం రేవంత్ ప్రసంగం:
పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, “ఇది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి పార్కులు కీలకంగా నిలుస్తాయి. యువతకు ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ పార్క్ నిర్మాణానికి పునాది వేయడం జరిగింది” అని అన్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *