Breaking News

Relief for Chandrababu in Supreme Court:

చంద్రబాబుకు సుప్రీంలో ఊరట:

చంద్రబాబుకు సుప్రీంలో ఊరట: సీబీఐకి బదిలీ పిటిషన్లు కొట్టివేత

న్యూఢిల్లీ:
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టు మరోసారి ఊరట కల్పించింది. చంద్రబాబుపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. కోర్టు ఈ పిటిషన్లను పూర్తిగా నిరాధారమైనవిగా పేర్కొంది.

పేదల కోసం భారీ హౌసింగ్ డ్రైవ్.. 2029 నాటికి ఇల్లు లేని వారే లేరు: చంద్రబాబు

పిటిషన్లపై సుప్రీం అసహనం:
పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, “ఇలాంటి పిటిషన్లు ఎలా వాదిస్తారు?” అంటూ న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది బాలయ్యను కోర్టు కఠినంగా ప్రశ్నించింది. “ఈ పిటిషన్ అసత్య ఆధారాలతో నిండి ఉంది. అలాంటి పిటిషన్లు దాఖలు చేస్తే తీవ్ర జరిమానాలు విధిస్తాం” అని కోర్టు స్పష్టం చేసింది.

సీఐడీ కేసులు సీబీఐకి ఎందుకు బదిలీ చేయాలన్న పిటిషన్?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వంటి కేసులపై జగన్ సర్కారు సీఐడీ ద్వారా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే న్యాయవాది బాలయ్య, చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నందున సీఐడీ ద్వారా విచారణ జరిగితే ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న తెల్ల పలుగు రాయి క్వారీ దృశ్యం

సుప్రీం తీర్పు:
ఈ పిటిషన్లను పూర్తిగా తప్పుడు ఆలోచనలతో నిండినవిగా పేర్కొన్న సుప్రీంకోర్టు, వాటిని విచారించేందుకు వీలులేదని తేల్చి చెప్పింది. “ఇలాంటి పిటిషన్లపై మరొకసారి అనవసరంగా వాదనలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం” అని కోర్టు హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *