Breaking News

People will teach Congress a lesson - Srinivas Goud

కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారు – శ్రీనివాస్ గౌడ్

|| People will teach Congress a lesson – Srinivas Goud ||

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, అధికారంలోకి వచ్చి 420 రోజులు అయినా వాగ్దానాలు అమలు చేయలేకపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

కాంగ్రెస్ పాలనపై విమర్శలు

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “రైతులు, సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మినహాయిస్తే, ఎవరూ సంతోషంగా లేరు” అని అన్నారు. “ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి ఉంది. తమ పబ్బం గడుపుకునేందుకు కొంతమంది నేతలు ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తున్నారు” అని ఆరోపించారు.

ఉద్యోగాలపై జీవోలతో అడ్డంకులు.. కవిత ఆరోపణలు

“ఇచ్చిన హామీలు నెరవేర్చక, ఇప్పుడు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే, ఆ దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నారో, వారికే స్పష్టత లేదు. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు మరో మాట మాట్లాడుతున్నారు” అంటూ ఎద్దేవా చేశారు.

“కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి సాధించింది”

శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిన్నది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

ప్రజలంతా కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్తారు

“రానున్న ఎన్నికల్లో ఓటుతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం చట్టానికి వ్యతిరేకంగా పని చేయకుండా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి” అని హెచ్చరించారు. “ఏ ఎన్నికలు వచ్చినా, ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు” అని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *