Breaking News

President Draupadi Key announcement on Polavaram project

పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం – పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుందని, ఈ దిశగా రూ.12,000 కోట్ల నిధులు కేటాయించిందని ఆమె వెల్లడించారు.

ఎన్డీయే ప్రభుత్వంతో ఏపీకి పెరుగుతున్న ప్రాధాన్యం

గత లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి, వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 21 మంది ఎంపీలు కూటమి తరఫున గెలుపొందడంతో కేంద్రంలో ఎన్డీయే కీలక భాగస్వామిగా మారింది.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఏపీకి కేంద్రం భారీ నిధుల మంజూరు

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా:
పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,000 కోట్లు మంజూరు
విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు మూడు విడతలుగా రూ. 11,440 కోట్లు
రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా రూ. 18,000 కోట్ల రుణం
జాతీయ రహదారుల అభివృద్ధికి, విశాఖ రైల్వే జోన్ అభివృద్ధికి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు భారీ నిధుల కేటాయింపు

కేంద్ర మద్దతుతో ఆంధ్రప్రదేశ్‌లో కీలక ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Telangana is the only state where farmer suicides have decreased
రైతు ఆత్మహత్యలు తగ్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *