సుదీర్ఘకాలం తర్వాత మౌనం వీడిన కేసీఆర్: “నేను కొడితే మామూలుగా ఉండదు”
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సుదీర్ఘ కాలం తర్వాత మౌనం వీడుతూ, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇన్నిరోజులుగా నేను మౌనంగా ఉన్నా, గంభీరంగా చూస్తున్నా, ఇప్పుడు నేను కొడితే అది మామూలుగా ఉండదు” అని చెప్పారు.
అలాగే, తెలంగాణ శక్తిని కాంగ్రెస్ నేతలకి చూపించి, “మెడలు వంచిస్తా” అని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గత ఏడాది పాలనలో, తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్ నేతలు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారు” అని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజలు తులం బంగారానికి ఆశపడి, కాంగ్రెస్కి ఓటు వేసినప్పటికీ, వారి అంచనాలు బోల్తా పడినట్టు వ్యాఖ్యానించారు.
