బడ్జెట్పై రాహుల్ గాంధీ విమర్శలు – “బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్”
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2025 కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో, లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
“ఈ బడ్జెట్ అసలు సమస్యలను పరిష్కరించలేదు. ఇది ‘బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ వేసినట్టుంది'” అని ఆయన ఎద్దేవా చేశారు.
🔹 ప్రపంచ స్థాయిలో తీవ్ర ఆర్థిక అస్థిరత కొనసాగుతోన్న నేపథ్యంలో, ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
🔹 అయితే ప్రస్తుత బడ్జెట్లో ఎలాంటి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు.
🔹 ప్రభుత్వం దివాళా కోరు ఆలోచనలతో ముందుకు సాగుతోందని ఆరోపించారు.
