ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం
అమరావతి: విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సస్పెన్షన్ నుంచి నియామకం వరకు – ఏబీవీ ప్రయాణం
🔹 గతంలో జగన్ ప్రభుత్వం రెండు సార్లు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
🔹 మొదటిసారి 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు, రెండోసారి 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు సస్పెన్షన్లో ఉన్నారు.
🔹 ఇటీవల ఆ సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
🔹 ఆ కాలంలో పొందాల్సిన వేతనాలు, అలవెన్సులను పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏబీవీపై నమోదైన అభియోగాల ఉపసంహరణ
ఇంతకుముందు ఏబీవీపై ప్రభుత్వం కొన్ని అభియోగాలు నమోదు చేసినప్పటికీ, ఇటీవల వాటిని వెనక్కి తీసుకోవడం గమనార్హం.
