కేటీఆర్ విమర్శలకు ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శలకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. “తెలంగాణకు గుండు సున్నా తేలిందని కేటీఆర్ అంటున్నాడు. కానీ అవగాహన లేకుండా మాట్లాడేవారిపై ఏమనే?” అని ఆయన ప్రశ్నించారు.
🔹 “బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల ఫలితాలను ప్రజలు అర్థం చేసుకుని దేశవ్యాప్తంగా మోడీకి పట్టం కడుతున్నారు. అది చూసి ఓర్వలేని వాళ్లు బడ్జెట్పై విమర్శలు చేస్తున్నారు” అని ఈటల విమర్శించారు.
🔹 “రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, జల్ జీవన్ మిషన్ వంటి కీలక పథకాలు రాష్ట్రాలకే కాదు, దేశ ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి” అని స్పష్టంచేశారు.
“కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత”
🔸 “తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది” అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
🔸 “ప్రభుత్వ పనితీరుపై అసహనం పెరిగిపోతుండటంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు స్వరం పెంచుతున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
🔸 “కూట్లె రాయి తీయనోడు ఏట్ల రాయి తీసినట్టుగా కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది” అని ఎద్దేవా చేశారు.
“ఇది ప్రజల బడ్జెట్ – యువతకు వరం”
ఈటల రాజేందర్ మాట్లాడుతూ “కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది” అని అన్నారు.
📌 “ఈ బడ్జెట్ యువతకు గొప్ప అవకాశం. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం అందిస్తోంది” అని గుర్తుచేశారు.
📌 “భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడమే దేశానికి మంచిది” అని వివరించారు.
📌 “తెలంగాణలో బొగ్గు గనులు ఉన్న ప్రాంతాలు భూగర్భజలాల పతనంతో భయంకర పరిస్థితికి చేరాయి. భూకంపాలకు కారణమయ్యే పరిస్థితి ఉంది” అని ఆవేదన వ్యక్తంచేశారు.
📌 “బొగ్గుతో తయారయ్యే విద్యుత్తును తగ్గించి, విండ్ మరియు సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించకపోవడం బాధాకరం” అని విమర్శించారు.
