Breaking News

Etala Rajender's "Priority for BC under BJP leadership"

కేటీఆర్ విమర్శలకు ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్

కేటీఆర్ విమర్శలకు ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శలకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. “తెలంగాణకు గుండు సున్నా తేలిందని కేటీఆర్ అంటున్నాడు. కానీ అవగాహన లేకుండా మాట్లాడేవారిపై ఏమనే?” అని ఆయన ప్రశ్నించారు.

🔹 “బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల ఫలితాలను ప్రజలు అర్థం చేసుకుని దేశవ్యాప్తంగా మోడీకి పట్టం కడుతున్నారు. అది చూసి ఓర్వలేని వాళ్లు బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారు” అని ఈటల విమర్శించారు.
🔹 “రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, జల్ జీవన్ మిషన్ వంటి కీలక పథకాలు రాష్ట్రాలకే కాదు, దేశ ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి” అని స్పష్టంచేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

“కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత”

🔸 “తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది” అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
🔸 “ప్రభుత్వ పనితీరుపై అసహనం పెరిగిపోతుండటంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు స్వరం పెంచుతున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
🔸 “కూట్లె రాయి తీయనోడు ఏట్ల రాయి తీసినట్టుగా కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది” అని ఎద్దేవా చేశారు.


“ఇది ప్రజల బడ్జెట్ – యువతకు వరం”

ఈటల రాజేందర్ మాట్లాడుతూ “కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది” అని అన్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

📌 “ఈ బడ్జెట్ యువతకు గొప్ప అవకాశం. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం అందిస్తోంది” అని గుర్తుచేశారు.
📌 “భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడమే దేశానికి మంచిది” అని వివరించారు.
📌 “తెలంగాణలో బొగ్గు గనులు ఉన్న ప్రాంతాలు భూగర్భజలాల పతనంతో భయంకర పరిస్థితికి చేరాయి. భూకంపాలకు కారణమయ్యే పరిస్థితి ఉంది” అని ఆవేదన వ్యక్తంచేశారు.
📌 “బొగ్గుతో తయారయ్యే విద్యుత్తును తగ్గించి, విండ్ మరియు సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించకపోవడం బాధాకరం” అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *