Breaking News

"Congress party is cheating BCs" - R. Krishnaiah

రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

తెలంగాణ కులగణన సర్వేపై ఆర్. కృష్ణయ్య విమర్శలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య తీవ్రస్థాయిలో స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

సర్వేలో లోపాలున్నాయా?

కులగణన సర్వే నివేదికలో అనేక లోపాలు ఉన్నాయంటూ ఆర్. కృష్ణయ్య ఆక్షేపించారు. అనేక బీసీ కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని, దీనిని వ్యూహాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కొందరు బీసీ నేతల ద్వారా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయిస్తున్నారని మండిపడ్డారు.

2027 నాటికి హైకోర్టు కొత్త భవనాలు పూర్తి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి

42% బీసీ రిజర్వేషన్ – రేవంత్ సవాల్

ఇదిలా ఉండగా, ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేస్తూ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. రిజర్వేషన్ల చట్టబద్ధత విషయంలో అటకాయించకుండా, కాంగ్రెస్ తన స్థాయిలో 42% సీట్లు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. అంతేకాదు, బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లు కూడా ఇదే శాతంలో టికెట్లు ఇవ్వగలరా? అంటూ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు.

బీఆర్ఎస్, బీజేపీ తుది నిర్ణయం ఏమిటి?

సీఎం రేవంత్ సవాల్‌పై బీఆర్ఎస్, బీజేపీలు ఎలా స్పందిస్తాయన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ రెండు పార్టీలు 42% బీసీలకు టికెట్లు కేటాయించారా? లేదా? అన్న ప్రశ్న రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆర్. కృష్ణయ్య విమర్శలు, సీఎం రేవంత్ సవాల్, బీసీ రిజర్వేషన్ అంశంపై తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి పెంచాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండగా, బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ప్రత్యర్థి పార్టీల వ్యూహం ఏంటి? అన్నది ఆసక్తిగా మారింది.

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *