హైదరాబాద్లో మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభంకానుంది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగనున్న ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
ఎజెండాలో ఏముంది?
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతం వంటి అంశాలపై సీఎం రేవంత్ కీలక మార్గదర్శకాలు ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో ఏం నిర్ణయాలు వెలువడతాయనే దానిపై అందరి దృష్టి నెలకొంది.
