కాపు మున్నూరు కాపు ,బలిజ,తూర్పు కాపు ప్రతినిధుల సమావేశం—రాష్ట్ర కాపు జే ఏ సి -చందు జనార్ధన్,మంగ బాబు
ఢిల్లీ-ఫెబ్రవరి 6– కాపు,మున్నూరు కాపు ,తూర్పు కాపు,బలిజ వర్గాల ప్రతినిధుల సమావేశం హైదరాబాద్ లో ఫెబ్రవరి 22 న జరగనుందని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చందు జనార్ధన్,రంగిశెట్టి మంగబాబు లు తెలిపారు.కులం ఎదుర్కొంటున్న ప్రధాన మైన సమస్యల పై ఈ ప్రతినిధుల సమావేశం లో చర్చించ నున్నట్లు ఈ సమావేశం కు చెందిన బ్రోచర్ ఆవిష్కరణ మన పార్లమెంట్ సభ్యుల,నాయకుల చేతుల మీదగా ఢిల్లీ లో జరిగినట్లు తెలిపారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు,dr కె లక్ష్మణ్ గారు ఎంపీ,పార్లమెంట రీ కమిటీ సభ్యులు,బిజెపి ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షులు,వద్దిరాజు రవిచంద్రగారు ఎంపీ బీఆర్ ఎస్ గాయత్రి గ్రానైట్స్ అధినేత,వల్లభనేని బాలశౌరి గారు ఎం పి జనసేన మచిలీపట్నం,పీ సి మోహన్ గారు ఎంపీ బిజెపి బెంగుళూర్,గోపి నాథ్ గారు ఎంపీ హోసూరు కాంగ్రెస్,తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ కాకినాడ జనసేన,సాన సతీష్ గారు ఎంపీ టీడీపీ,సుమన్ టీవీ చైర్మన్ సుమన్ గారు,సి హెచ్ విఠల్ గారు మాజీ టి ఎస్ పి ఎస్ సి సభ్యులు,వుసా రఘు గారు సీనియర్ న్యాయవాది మున్నూరు కాపు సంఘం క్రమశిక్షణ సంఘం చైర్మన్,వేదుల వెంకటరమణ గారు,త్రిబుల్ ఇటీ మాజీ వీసీ ,సుధీర్ గారు ప్రముఖ వ్యాపారస్తులు,సంఘ నాయకులు,చందు శ్రీనివాస్ గారు మెగా పొలిటికల్ ఎనలిస్ట్,dr పీ ఎల్ ఎన్ పటేల్ పెన్ సంఘనాయకులు,బేతి శ్రీధర్ ప్రముఖ వ్యాపారస్తులు పెన్ సంఘ నాయకులు పాల్గొన్నారు.


