సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎల్పీ సమావేశం జరిగింది, ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై దిశానిర్దేశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యచరణపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను కీలకంగా చర్చించారు. ఈ రెండు చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజలకు సరిగ్గా చేరవేసేలా ఆదేశించారు.
భారీ బహిరంగ సభలు – జాతీయ నేతల ఆహ్వానం
ఈ రెండు కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లను ఈ సభలకు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.
