Breaking News

YS Jaganmohan Reddy Jagan "Trust is important in politics" – Jagan

“రాజకీయాల్లో విశ్వాసం ముఖ్యం” – జగన్

“రాజకీయాల్లో విశ్వాసం ముఖ్యం” – వైసీపీని వీడిన ఎంపీలపై జగన్ స్పందన

అమరావతి: వైసీపీ (YSRCP) నుంచిRajya Sabha ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. “రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వాసం చాలా ముఖ్యమైనవి” అని ఆయన అన్నారు.

“ప్రలోభాలకు లొంగడం, భయపడటం రాజకీయ నాయకుడికి తగదు”

జగన్ మాట్లాడుతూ, “ప్రలోభాలకు లొంగో, భయంతో వ్యక్తిత్వాన్ని తగ్గించుకుంటే ఎలా?” అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి సహా పార్టీని వీడిన అందరికీ ఇదే వర్తిస్తుందని తెలిపారు. “ఇంకా ఎవరు పార్టీని వదిలివెళ్లినా, వారికీ ఇదే వర్తిస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.

ఐజేయు సెక్రటరీ జనరల్ సోమసుందర్ కు తాడేపల్లిగూడెం పాత్రికేయుల శుభాకాంక్షలు

“వైసీపీ నేడు ఉందంటే, అది నాయకుల వల్ల కాదు”

జగన్ తన మాటల్లో, “వైసీపీ నేడు బలంగా నిలిచి ఉంది అంటే, అది వ్యక్తుల వల్ల కాదు” అని పేర్కొన్నారు. పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే.

జగన్ వ్యాఖ్యలు – వైసీపీ లోపలి రాజకీయాల్లో కొత్త మలుపు?

జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు, పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతలపై కఠిన వైఖరిని స్పష్టం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఇంకా మరికొందరు వైసీపీని వీడతారా? లేదా? అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *