Breaking News

HYDRA Commissioner Ranganath was asked "Telugu come?" That is the question

హైడ్రా కమిషనర్ ను “తెలుగు వచ్చా?” అని ప్రశ్న

అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ సమావేశం – వాగ్వాదంతో వేడెక్కిన సమావేశం

అమీన్‌పూర్: అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్లాట్ల కొలతలు, అభివృద్ధి పనులపై చర్చ జరిగింది.

బాధితులతో కమిషనర్ భేటీ – హీట్ ఎక్కిన చర్చ

సమావేశం అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐలాపూర్ గ్రామ వాసి, సుప్రీం కోర్టు న్యాయవాది ముఖీం హైడ్రా కమిషనర్‌తో మాట్లాడుతుండగా విద్రోహ వాతావరణం ఏర్పడింది.

తల్లిదండ్రుల సంరక్షణపై కఠిన చట్టం.. నిర్లక్ష్యానికి ఇక గట్టి హెచ్చరిక: సీఎం ఎ. రేవంత్ రెడ్డి

“తెలుగు వచ్చా?” – కమిషనర్, న్యాయవాదికి మధ్య వాగ్వాదం

ముఖీం కమిషనర్ రంగనాథ్‌ను “తెలుగు వచ్చా?” అని ప్రశ్నించగా,
రంగనాథ్ స్పందిస్తూ “మీరు చెప్పేది చెప్పండి.. ఓవర్ యాక్షన్ చేయొద్దు” అని హెచ్చరించారు.

బాధితుల వాదనలు – వైరల్ వీడియో

ఈ ఘటనపై ఇతర సభ్యులు కూడా చర్చించగా, కమిషనర్ తీసుకున్న నిర్ణయాలపై బాధితులు వాదనలు వినిపించారు. సమావేశంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. తెలంగాణలో కొత్త చట్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *