Breaking News

"If you have courage, resign and contest again"

“ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి” – కామారెడ్డి ఎమ్మెల్యే

పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తీవ్ర విమర్శలు

కామారెడ్డి: పార్టీ మార్పిడులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “పార్టీ మారుతున్న వారు ఇద్దరూ దొందు దొందే” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

“ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి”

  • “పార్టీ మారిన ఎమ్మెల్యేలు నిజమైన నాయకులు అయితే రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి” అని ఆయన సూచించారు.
  • “రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారు మొగోళ్లా? లేదంటే ఆడంగులా?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
  • “రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిస్తేనే నిజమైన ప్రజా నేతలు” అని స్పష్టం చేశారు.

“రుణమాఫీ పూర్తిగా జరగలేదు – ప్రభుత్వంపై విమర్శలు”

  • “రాష్ట్రంలో నలభై శాతానికి మించి రుణమాఫీ జరగలేదని” వెంకట రమణారెడ్డి ఆరోపించారు.
  • “పక్కింటి కుటుంబ సమస్యల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే మంత్రులు ఉన్నారు” అని ఎద్దేవా చేశారు.

“కులగణన రాజకీయ లెక్కలు మాత్రమే”

  • “కులగణన పేరుతో ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది” అని వ్యాఖ్యానించారు.
  • “మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మైండ్‌సెట్ ఒకటే” అని విమర్శించారు.

“ప్రభుత్వాన్ని కూల్చే అవసరం లేదు – అవిశ్వాసం పార్టీ నిర్ణయం కాదు”

  • “ప్రభుత్వాన్ని కూలగొట్టే ఓపిక మాకు లేదు, అలాంటి అవసరం కూడా లేదు” అని వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు.
  • “అవిశ్వాసం ఒక్క ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, అది పార్టీ నిర్ణయం కాదు” అని తెలిపారు.
  • “ప్రజల అసంతృప్తిని ఎండగడతాం” అని ఆయన అన్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *