పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తీవ్ర విమర్శలు
కామారెడ్డి: పార్టీ మార్పిడులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “పార్టీ మారుతున్న వారు ఇద్దరూ దొందు దొందే” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.
“ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి”
- “పార్టీ మారిన ఎమ్మెల్యేలు నిజమైన నాయకులు అయితే రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి” అని ఆయన సూచించారు.
- “రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారు మొగోళ్లా? లేదంటే ఆడంగులా?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
- “రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిస్తేనే నిజమైన ప్రజా నేతలు” అని స్పష్టం చేశారు.
“రుణమాఫీ పూర్తిగా జరగలేదు – ప్రభుత్వంపై విమర్శలు”
- “రాష్ట్రంలో నలభై శాతానికి మించి రుణమాఫీ జరగలేదని” వెంకట రమణారెడ్డి ఆరోపించారు.
- “పక్కింటి కుటుంబ సమస్యల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే మంత్రులు ఉన్నారు” అని ఎద్దేవా చేశారు.
“కులగణన రాజకీయ లెక్కలు మాత్రమే”
- “కులగణన పేరుతో ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది” అని వ్యాఖ్యానించారు.
- “మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మైండ్సెట్ ఒకటే” అని విమర్శించారు.
“ప్రభుత్వాన్ని కూల్చే అవసరం లేదు – అవిశ్వాసం పార్టీ నిర్ణయం కాదు”
- “ప్రభుత్వాన్ని కూలగొట్టే ఓపిక మాకు లేదు, అలాంటి అవసరం కూడా లేదు” అని వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు.
- “అవిశ్వాసం ఒక్క ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, అది పార్టీ నిర్ణయం కాదు” అని తెలిపారు.
- “ప్రజల అసంతృప్తిని ఎండగడతాం” అని ఆయన అన్నారు.
