Breaking News

"If you have courage, resign and contest again"

“ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి” – కామారెడ్డి ఎమ్మెల్యే

పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తీవ్ర విమర్శలు

కామారెడ్డి: పార్టీ మార్పిడులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “పార్టీ మారుతున్న వారు ఇద్దరూ దొందు దొందే” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.

తల్లిదండ్రుల సంరక్షణపై కఠిన చట్టం.. నిర్లక్ష్యానికి ఇక గట్టి హెచ్చరిక: సీఎం ఎ. రేవంత్ రెడ్డి

“ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి”

  • “పార్టీ మారిన ఎమ్మెల్యేలు నిజమైన నాయకులు అయితే రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి” అని ఆయన సూచించారు.
  • “రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారు మొగోళ్లా? లేదంటే ఆడంగులా?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
  • “రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిస్తేనే నిజమైన ప్రజా నేతలు” అని స్పష్టం చేశారు.

“రుణమాఫీ పూర్తిగా జరగలేదు – ప్రభుత్వంపై విమర్శలు”

  • “రాష్ట్రంలో నలభై శాతానికి మించి రుణమాఫీ జరగలేదని” వెంకట రమణారెడ్డి ఆరోపించారు.
  • “పక్కింటి కుటుంబ సమస్యల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే మంత్రులు ఉన్నారు” అని ఎద్దేవా చేశారు.

“కులగణన రాజకీయ లెక్కలు మాత్రమే”

  • “కులగణన పేరుతో ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది” అని వ్యాఖ్యానించారు.
  • “మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మైండ్‌సెట్ ఒకటే” అని విమర్శించారు.

“ప్రభుత్వాన్ని కూల్చే అవసరం లేదు – అవిశ్వాసం పార్టీ నిర్ణయం కాదు”

  • “ప్రభుత్వాన్ని కూలగొట్టే ఓపిక మాకు లేదు, అలాంటి అవసరం కూడా లేదు” అని వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు.
  • “అవిశ్వాసం ఒక్క ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, అది పార్టీ నిర్ణయం కాదు” అని తెలిపారు.
  • “ప్రజల అసంతృప్తిని ఎండగడతాం” అని ఆయన అన్నారు.

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. తెలంగాణలో కొత్త చట్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *