Breaking News

BJP leading - AAP is facing a huge setback

బీజేపీ ముందంజ – ఆప్‌కు భారీ ఎదురుదెబ్బ

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ముందంజ – ఆప్‌కు భారీ ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలేందుకు మరికొన్ని గంటల సమయమే ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

బీజేపీ ఆధిక్యం – ఆప్‌కు షాక్

  • తాజా లెక్కింపు ప్రకారం, బీజేపీ 42 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో ముందంజలో ఉంది.
  • కల్కాజీ, బిజ్వాసన్, మాల్వియా నగర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు.
  • కల్కాజీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి, ఆప్ అభ్యర్థి అతిషపై ఆధిక్యంలో ఉన్నారు.
  • బిజ్వాసన్ నుంచి బీజేపీ అభ్యర్థి కైలాష్ గెహ్లాట్ 12 వేల పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • మాల్వియా నగర్ నుంచి ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి వెనుకంజలో ఉన్నారు.

కేజ్రీవాల్ స్వల్ప ఆధిక్యం

  • మూడో రౌండ్ గడిచే సరికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేవలం 343 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.
  • కేజ్రీవాల్‌కు 6,442 ఓట్లు వస్తే, బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మకు 6,099 ఓట్లు వచ్చాయి.

బీజేపీ కార్యాలయంలో సంబరాలు

  • బీజేపీ ముందంజలో ఉండటంతో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.
  • బ్యాండ్, సంగీతం, నినాదాలతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాహంగా ఉన్నారు.

కాంగ్రెస్కు భారీ పరాజయం

  • కాంగ్రెస్ ఇప్పటికీ ఖాతా తెరవలేదు.

ఈ ఫలితాలతో ఢిల్లీలో బీజేపీ అధికారానికి దగ్గరగా వెళ్తుందా? లేక ఆప్ పుంజుకుంటుందా? అన్నదే ఉత్కంఠగా మారింది.

Telangana is the only state where farmer suicides have decreased
రైతు ఆత్మహత్యలు తగ్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *