Breaking News

"Cathesque fraud - we will remove the word Muslim BC"

“కులగణనతో మోసం – ముస్లిం బీసీ అనే పదం తొలగిస్తాం”

“కులగణనతో మోసం – ముస్లిం బీసీ అనే పదం తొలగిస్తాం” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ (Congress) కూడా ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

శనివారం హైదరాబాద్ గోల్కొండ హోటల్‌లో బీజేపీ కీలక నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.

“26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది”

“డబుల్ ఇంజిన్ సర్కార్ (Double Engine Sarkar) ఏర్పడబోతోంది. అద్భుతమైన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు.”

“దక్షిణాదిలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది. కర్ణాటక, తెలంగాణలో కూడా త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.”

దుండగుల దురాగతం.. రైతు శ్రమకు నిప్పులు

“కులగణనతో మోసం – ముస్లిం బీసీ అనే పదం తొలగిస్తాం”

“కులగణన (Caste Census) పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది. బీసీలను విభజించి ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అని విభజించడమే మీ ఆదర్శమా?”

“రాజ్యాంగంలో ముస్లిం బీసీ అనే పదం ఎక్కడ ఉందో కాంగ్రెస్ చెప్పాలి.”

“బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్యాయం చేశారు.”

“బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం బీసీ అనే పదాన్ని తప్పకుండా తొలగిస్తాం.”

“కాంగ్రెస్‌ను బుద్ధిచెప్పాలి”

ప్రజల భాగస్వామ్యంతో మూసి పునర్జీవనం: భట్టి విక్రమార్క మల్లు

“తెలంగాణలో కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తూ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది.”

“బీసీలను అవమానిస్తూ తీవ్ర అన్యాయం చేస్తోంది.”

“బీజేపీ బలంగా ముందుకు సాగి కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉంది.”

బీజేపీ కీలక నేతల హాజరు

ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎన్నికల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *