Breaking News

"We will be committed to fulfilling our promises" - PM Modi

“హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటాం” – ప్రధాని మోదీ

ఢిల్లీ విజయం భాజపాదే: ప్రధాని మోదీ హర్షం

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. 27 ఏళ్లుగా ఢిల్లీ పీఠం కోసం ఎదురుచూస్తున్న కమలనాథులు ఈసారి గెలుపును తమ ఖాతాలో వేసుకున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ను ఓడించి, ఢిల్లీలో అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భాజపా శ్రేణులకు అభినందనలు తెలిపారు.

ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు
  • “మానవశక్తిని మించేది ఏదీ లేదు” అంటూ పార్టీ కార్యకర్తల కృషిని ప్రశంసించారు.
  • “అభివృద్ధి గెలిచింది.. సుపరిపాలన నెగ్గింది” అంటూ విజయం పై హర్షం వ్యక్తం చేశారు.

“హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటాం”

ప్రధాని మోదీ ఓ ట్వీట్ ద్వారా ప్రజలకు హామీ ఇచ్చారు.

  • “భాజపాకు చారిత్రాత్మక విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.”
  • “ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి, ఢిల్లీ సమగ్రాభివృద్ధికి పాటుపడతాం.”
  • “ఏ ఒక్క అంశాన్ని కూడా విస్మరించకుండా ప్రజల జీవనోత్సాహాన్ని పెంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం.”
  • “భారత దేశ అభివృద్ధిలో ఢిల్లీ కీలక పాత్ర పోషించబోతోంది” అని మోదీ స్పష్టం చేశారు.

ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో, దేశవ్యాప్తంగా కమలనాథుల శ్రేణుల్లో ఆనందం నెలకొంది.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై కేంద్రం తాజా ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *