కాంగ్రెస్ మోసపూరిత పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలి: కేటీఆర్🔥
📍 ఖమ్మం: తెలంగాణలో ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.
🔹 కాంగ్రెస్ మోసపూరిత పాలన
📌 “కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది” – కేటీఆర్
📌 “ఈ ప్రభుత్వంపై మోసపోయామని అనుకోని వర్గం ఏది లేనే లేదు”
📌 “రాజకీయ కుట్రలు పన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాలో మంత్రులు ఏకగ్రీవాలకు కుట్ర చేస్తున్నారు”
🔹 వరదల్లో ప్రజలకు మద్దతు ఎవరిదీ?
📌 “ఖమ్మం జిల్లాలో మూడు మంత్రులు ఉన్నా, వరదల సమయంలో ప్రజలకు ఉపయోగపడలేదు”
📌 “వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడేందుకు కనీసం హెలికాప్టర్ పంపలేకపోయారు”
📌 “బీఆర్ఎస్ హయాంలో మాత్రం మారుమూల గ్రామాలకు హెలికాప్టర్లను పంపి ప్రజలను కాపాడాం”
🔹 కాంగ్రెస్ నేతల పనితీరు పై ఆగ్రహం
📌 “ఎమ్మెల్యేల పుట్టినరోజులకు, ఇతర పనికిమాలిన కార్యక్రమాలకు మాత్రం హెలికాప్టర్లలో Hyderabad నుంచి వస్తున్నారు”
📌 “ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి కాంట్రాక్టులన్నీ స్వాహా చేసుకుంటున్నారు”
📌 “డిప్యూటీ సీఎం 30% కమిషన్లు తీసుకుంటున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెబుతున్నాడు”
📢 “కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడంతో తెలంగాణ ప్రజలు నష్టపోయారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు” అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 🚀 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 🔥
