📌 ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – మంత్రి అచ్చెన్నాయుడు
బర్డ్ ఫ్లూ వైరస్పై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) స్పందించారు.
✔️ “ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు,” అని మంత్రి స్పష్టం చేశారు.
✔️ “ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు” అని తెలిపారు.
✔️ సోషల్ మీడియాలో కొందరు పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అలాంటి వార్తలు ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
✔️ బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావిత ప్రాంతాలను ఒక కిలోమీటర్ పరిధికి మాత్రమే పరిమితం చేయాలని, కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తల సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
📌 బర్డ్ ఫ్లూ నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
👉 కేంద్ర ప్రభుత్వంతో చర్చలు – వైరస్ కట్టడి కోసం శాస్త్రవేత్తలతో సమీక్ష
👉 వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలకు ప్రత్యేక మార్గదర్శకాలు
👉 ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచారం
